దారుణం : బెట్టింగ్ ల కోసం తల్లికి, సోదరికి విషమిచ్చి చంపిన కొడుకు

-

వ్యసనాలు, మనుషులను రాక్షసులను చేస్తున్నాయి. విచక్షణ కోల్పోయి ఏకంగా తల్లిని, చెల్లిని చంపాడు ఒక దుర్మార్గుడు. ఐపీఎల్ బెట్టింగ్స్ కోసం అప్పులు చేసి వాటిని తీర్చెందుకు గాను ఓ యువకుడు తల్లికి, సోదరికి విషం ఇచ్చి చంపిన  సంఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రావులకోల్లు గ్రామానికి చెందిన సాయి రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణం పాలయ్యాడు.

ఈ క్రమంలో చనిపోయిన తండ్రి పేరిట వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షలు తనకే దక్కాలనే ఉద్దేశంతో తల్లిని సోదరిని ఇన్సూరెన్స్ లో వచ్చిన డబ్బులు కొరకు వేధిస్తున్నాడు. అయితే వారు ఇతనికి ఇచ్చేందుకు సుముకంగా లేరు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న వారిద్దరికీ అన్నంలో విషం కలిపి హత్యాయత్నం చేసర్. అయితే 27న సోదరి అనూష చికిత్స పొందుతూ మరణించగా తల్లి సునీత కూడా చికిత్స పొందుతూ తాజాగా మరణించింది.

Read more RELATED
Recommended to you

Latest news