రెండో రోజు ఏపీ అసెంబ్లీలో రచ్చ.. ఈరోజు కూడా సస్పెన్షన్ !

-

శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైన సంగతి తెలిసిందే అయితే మొదటి రోజు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అలాగే పంట రుణం సంబంధిత అంశాలు అధికారపక్షం మీద విభేదించిన టీడీపీని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు కూడా ఏపీ అసెంబ్లీ లో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి.

రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ రోజు టిడ్కో ఇళ్ళమీద సభలో టీడీపీ ఆందోళనకు దిగింది. దీంతో మళ్ళీ ఏపీ అసెంబ్లీలో రగడ మొదలైందని చెప్పాలి. ఈ అంశం మీద స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి టిడిపి సభ్యులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఈరోజు కూడా సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు ఇక ఏపీ అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా పడింది. 

Read more RELATED
Recommended to you

Latest news