ఏడేళ్ళు పూర్తి.. ఆ తర్వాతేంటి రకుల్..?

-

రకుల్ ప్రీత్ సింగ్ ఇండస్టీకి వచ్చి ఏడేళ్ళు పూర్తి చేసుకుంది. కెరటం సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టిన రకుల్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో విజయం దక్కింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మంచు మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ సినిమాలో కనిపించి సక్సెస్ అందుకుంది. దాంతో స్టార్ హీరోల దృష్టిలో పడింది. నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు, స్పైడర్ వంటి అవకాశాలు దక్కాయి.

ఐతే ప్రస్తుతం రకుల్ కి పెద్దగా అవకాశాలు లేవు. నాగార్జునతో నటించిన మన్మధుడు 2 సినిమా తర్వాత భారీగా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంద. అటు హిందీలోనూ పెద్దగా అవకాశాలు లేవు. ఏడేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మంచి విజయాలు అందుకున్న రకుల్ కి సడెన్ గా ఆఫర్లు తగ్గాయి. ఈ మధ్య వచ్చిన రకుల్ సినిమాలు సక్సెస్ కాకపోవడమే దానికి కారణం. మరి రకుల్ కెరీర్ కి బూస్ట్ అప్ ఇచ్చే మంచి సక్సెస్ వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news