రాముడిగా ప్రభాస్.. లక్ష్మణుడిగా అతనే..?

-

ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రామాయణ ఇతిహాస గాథని త్రీడీలో చిత్రీకరించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్, రాముడిగా కనిపిస్తున్నాడు. రావణుడిగా సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారని ఇంతకుముందే ప్రకటించాడు. దాంతో లక్ష్మణుడిగా ఎవరు చేస్తున్నారనే విషయంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడిగా చేస్తున్నాడని అంటున్నారు.

సోనూ కి టిటూ కి స్వీటీ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన సన్నీ సింగ్ ని లక్ష్మణుడి పాత్ర కోసం సంప్రదించారని వినబడుతుంది. సన్నీ సింగ్ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడని తెలుస్తుంది. మరి పొద్దున్నపూట అప్డేట్లు ఇస్తున్న ఆదిపురుష్ చిత్రబృందం లక్ష్మణుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news