గంటా శ్రీనివాసరావుకి షాక్ ఇస్తున్న బ్యాంకు…!

-

గత కొంత కాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకి ఇండియన్ బ్యాంకు షాక్ ఇవ్వడానికి రెడీ అయింది. నవంబర్ 25 న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వ్యాపార భాగస్వామి గా ఉన్న ప్రత్యూష కంపెనీ ఆస్తుల వేలం వేయనున్నారు. మొత్తం 248 కోట్ల రూపాయలు ఇండియన్ బ్యాంకు చెల్లించాల్సి ఉండగా గతంలోనే ఆయన ఆస్తులు స్వాధీనం చేసుకుంది.

 

హైదరాబాద్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్… ఈ వేలం వేస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తో పాటు అతనితో భాగస్వాములుగా ఉన్నటువంటి ప్రత్యూష కంపెనీకి చెందిన పలువురు సభ్యుల ఆస్తుల వేలం వేయడానికి రెడీ అయ్యారు. అయితే దీనిపై ఇంకా గంటా శ్రీనివాసరావు స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news