రాష్ట్రంలోకి రావాలంటే కరోనా టెస్ట్ కావాల్సిందే: సిఎం

-

ఉత్తరాఖండ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. డెహ్రాడూన్‌ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున, ఉత్తరాఖండ్‌ లోకి ప్రవేశించే ప్రజలు వేగంగా యాంటిజెన్ కోవిడ్ -19 పరీక్ష చేయించుకోవలసి ఉంటుందని పోలీసులు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుండి, ముఖ్యంగా ఢిల్లీ నుండి వచ్చే ప్రజలను రాష్ట్రంలోని అష్క్రోడి, కుల్హాన్ మరియు పాస్ గేట్ సరిహద్దు చెక్ పోస్టుల వద్ద చెక్ చేస్తారు.

కరోనా వైరస్ పరీక్ష చేసిన తర్వాత మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తారు. “సరిహద్దు చెక్ పోస్టులలో పోస్ట్ చేసిన పోలీసులకు ఈ ఆదేశాలు ఇచ్చాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కచితంగా తమ వివరాలు ఇవ్వాల్సిందే. ఈ విషయంలో మేము కఠినంగా వ్యవహరిస్తాం.” అని డెహ్రాడూన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డిఐజి) అరుణ్ మోహన్ జోషి చెప్పారు. ఆ రాష్ట్రంలో వారానికి ఒకసారి లాక్ డౌన్ ని కచ్చితంగా అమలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news