స్పీకర్ కి వేలు చూపిస్తూ చంద్రబాబు వార్నింగ్, స్పీకర్ వర్సెస్ బాబు

-

ఏపీ శాసన సభా సమావేశాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఈ సమావేశాల్లో రైతుల అంశం గురించి పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. అయితే విపక్ష తెలుగుదేశం సభలో పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది. టిడ్కో ఇళ్ళ విషయంలో ఏపీ శాసన సభలో వివాదం నెలకొంది. చంద్రబాబు వర్సెస్ స్పీకర్ గా పరిస్థితి మారింది. స్పీకర్ హుందాగా ఉండాలని చంద్రబాబు చెప్పగా నీ దగ్గర నీతులు నేర్చుకునే స్థితిలో లేను అని స్పీకర్ అన్నారు.

నువ్వెంత అంటే నువ్వెంత అని స్పీకర్, చంద్రబాబు అనుకున్నారు. సిఎం జగన్ జోక్యం చేసుకుని సభలో హుందాగా ప్రవర్తించాలని అన్నారు. పదే పదే విపక్షం సభను అడ్డుకోవడంపై స్పీకర్ అసహనం వ్యక్తం చేసారు. టీడీపీ సభ్యులు కూడా స్పీకర్ పై మండిపడ్డారు. ఇక నీ శాపనార్ధాలకు తాను భయపడేది లేదు అని స్పీకర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news