పవన్ కళ్యాణ్ లెక్క అదేనా

-

పవన్‌ కళ్యాణ్‌ కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అని చెప్తాడు గానీ, క్రిష్‌ సినిమా విషయంలో పవన్‌ లెక్కలు మాత్రం కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గానే ఉన్నాయి. ఎప్పుడో లాక్‌డౌన్‌కి ముందు మొదలుపెట్టిన క్రిష్ సినిమాని పక్కనపెట్టి, మరో మూవీ స్టార్ట్ చేస్తున్నాడు. దీంతో క్రిష్‌ కూడా వేరే ప్రాజెక్ట్‌ చూసుకుంటున్నాడట. మరి పవన్‌ క్రిష్‌ సినిమా ఎందుకు పక్కకెళ్లిపోతోంది?

పవన్‌ కళ్యాణ్, క్రిష్‌ కాంబినేషన్‌లో ఒక పీరియాడికల్ డ్రామా స్టార్ట్ అయ్యింది. ఔరంగజేబ్‌ కాలంనాటి కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా లాక్‌డౌన్‌కి ముందు ఒక షెడ్యూల్‌ కూడా కంప్లీట్‌ చేసుకుంది. అయితే ఇప్పుడు అన్‌లాక్‌లో పవన్‌ ఈ ప్రాజెక్ట్‌ని పక్కనపెట్టి, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌ని సెట్స్‌కి తీసుకెళ్తున్నాడనే టాక్ వస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ‘వకీల్‌సాబ్’ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే పవన్’అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌ స్టార్ట్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్‌ ఈ మూవీ స్క్రిప్ట్‌ కూడా పూర్తి చేస్తున్నాడని, త్వరలోనే సాగర్‌ చంద్ర డైరెక్షన్‌లో అయ్యప్పన్‌ సెట్స్‌కి వెళ్తాడని టాక్ వస్తోంది. దీంతో క్రిష్‌ ‘అతను అడవిని జయించాడు’ నవలని సినిమాగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడట.

అన్‌లాక్‌లో షూటింగులు స్టార్ట్ అయ్యాక పవన్‌ కళ్యాణ్‌ రావడానికి లేట్‌ అవుతుందని మెగా మేనళ్లుడు వైష్ణవ్‌తేజ్‌తో ఒక సినిమా తీశాడు క్రిష్. ఇప్పుడు ఇంకా లేట్‌ అవుతుందని మరో మూవీ కూడా ప్లాన్ చేస్తున్నాడు. మరి పవన్‌ ఆల్రెడీ మొదలైన క్రిష్‌ సినిమాని పక్కనపెట్టి, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌కి ఎందుకు ప్రిఫరెన్స్‌ ఇస్తున్నాడు అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news