మైనర్ బాలిక పై యువకుడి లైంగిక దాడి..విషయం తెలిసి వృద్దుడు కూడా !

-

ఎన్ని చట్టాలు చేసినా మహిళల మీద దాడులు మాత్రం ఆగడం లేదు. అసలు మన సమాజంలో ఆడదానికి రక్షణ లేకుండా పోతోంది. మూడేళ్ళ పసి పాప గురించి 80 ఏళ్ల పండు ముదుసలి దాకా బయటికి వస్తే రక్షణ ఉంటుందని నమ్మకం లేకుండా పోతుంది. తాజాగా ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కామాంధుల చేతిలో నలిగి పోయిన ఓ మైనర్ బాలిక గర్భం దాల్చింది. వివరాల్లోకి వెళ్తే విశాఖ జిల్లా పెందుర్తి కి చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి చేసుకుంటానని మోసం చేసి కార్తీక్ అనే ఒక యువకుడు శారీరికంగా లోబరుచుకున్నాడు.

అయితే ఈ విషయం తెలిసిన 60 ఏళ్ల వృద్ధుడు ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి తాను కూడా ఆ బాలికను ఈ విషయం నలుగురికీ చెబుతాను అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి శారీరకంగా అనుభవించడం మొదలు పెట్టాడు. ఇలా వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు బాలికను శారీరకంగా వాడుకోవడంతో ఆమె ఇప్పుడు గర్భం దాల్చింది. ఇంట్లో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమె తల్లిదండ్రులు హాస్పిటల్లో చేర్చారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు బాలికకు గర్భం ఉందని తేల్చారు. దీంతో తల్లిదండ్రులు బాలికని నిలదీయగా ఆమె తనకు జరిగిన దారుణం గురించి బయట పెట్టింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news