ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా.. రష్మిక అవుట్.. కియారా ఇన్..!?

-

అరవింద సమేత అనే సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మరోసారి త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు అనే విషయం తెలిసిందే. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా అప్డేట్ గురించి ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన ఎన్టీఆర్ సరసన మొదటిసారి హీరోయిన్ గా నటించబోతుందని గత కొన్ని రోజుల నుండి టాక్ వైరల్ గా మారిపోయింది.

కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లో రష్మిక మందన నటించడం లేదని రష్మిక మందన స్థానంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ నటించబోతున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. కియారా అద్వానీ అయితే ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో పాత్ర కోసం సరిగ్గా సెట్ అవుతుందని చిత్ర బృందం భావించిందని అందుకోసమే.. కాస్త పారితోషికం ఎక్కువైనప్పటికీ కియారా అద్వానీ నీ చిత్రబృందం సెలెక్ట్ చేసింది అన్న టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news