అక్రమ సంబంధం వ‌ద్దు….కూతురు, కొడుకు ఫోన్లకు ఫోటోస్

-

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో కలతలు రేపుతున్నాయి. అంతేకాదు మానవ సంబంధాలను కూడా మంటగలుస్తున్నాయి. ఒక్కసారి ఆ అక్రమ సంబంధాలకు అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. ఒకవేళ పిల్లల గురించి సమాజం గురించి ఆలోచించి బయటపడినా అవతలి వారు బయటపడనీయని పరిస్థితి. వారు పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి బ్రేకప్ చెప్పిందనే కోపంతో తాను, తన మాజీ ప్రియురాలు సాన్నిహిత్యంగా ఉన్న పోటోలను ఆమె కూతురు, కొడుకు ఫోన్లకు పంపించాడు ఓ ప్రబుద్ధుడు.

దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల అంబవాడి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంది. ఓ క్యాటరింగ్ ఏజెన్సీని నడుపుతూ జీవనం సాగిస్తుంది. అయితే, ఏడాదిన్నర క్రితం మితేశ్ పర్మర్ అనే వ్యక్తితో మహిళకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది.

అయితే తాను తప్పు చేస్తున్నానని భావించిన సదరు మహిళ అతనితో రిలేషన్ తెంచుకోవాలని నిర్ణయించింది. అతన్ని దూరంగా పెట్టింది. అయితే దీనికి ఆగ్రహించిన అతను బాధిత మహిళ కూతురు, కుడుకు ఫోన్లకు వారు సాన్నిహిత్యంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను పంపించాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్మర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news