దీపావళి నాడు ఈ ఇద్దరు దేవతలను ఆరాధిస్తే ఇక మీకు అష్ట ఐశ్వర్యాలు సొంతం!!

-

దీపావళి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యం ఉంది. యుగయుగాలుగా ఈ రోజున విజయాలు సాధించిన మహాత్ముల చరిత్ర తెలుసుకోవడమే కాకుండా పురాణాల్లో చెప్పినట్లు ఆయా దేవతలను ఆరాధిస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. ఆ వివరాలు తెలుసుకుందాం… లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. శుభ్రంగా కళకళలాడే ఇంట లక్ష్మీదేవి నివాసముంటుంది. అమ్మవారు తాము పెట్టిన దీపాల వెంట రావాలని కోరుతూ సాయంత్రమయ్యే సరికి ప్రమిదల దీపాలు, లేదంటే, రంగురంగుల బల్బులు కల తోరణాలను ఇంటికి కట్టి అలంకరణలు చేస్తారు. ఇక దీపావళి పూజలో ప్రధానంగా వినాయకుడిని, లక్ష్మీ దేవిని పూజించాలని పండితులు పేర్కొంటున్నారు.

ఏ పూజ చేసినా విఘ్నఅధిపతి అయిన వినాయకుడిని ముందుగా పూజించాలి. దీని తర్వాత లక్ష్మీ దేవిని ఆమె మూడు రూపాలయిన లక్ష్మీ, సరస్వతి, మహా కాళి, రూపాలలో పూజిస్తారు. వీరితో పాటు ధనాగారాలకు అధిపతి అయిన కుబేరుడిని కూడా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీ గణపతులను పూజిస్తారు. లక్ష్మీదేవి రూపం గణపతితో పాటు వుంటుంది. అందుచేత తాము నిర్వహించే కార్యాలకు ఎటువంటి విఘ్నాలు లేకుండా చూడాలని సిరులిచ్చే తల్లి కరుణాకటాక్షాలు ఎల్లవేళలావుండాలని కోరుకుంటూ దీపావళి వేళ లక్ష్మీగణపతుల పూజ చేస్తారు. మీరు కూడా లక్ష్మీగణపతులను పూజ చేసి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ పూజలకు అవకాశం లేనివారు కనీసం గణపతి అష్టోతరం, లేదా ఓం గం గణపతయేనమః అనే నామాన్ని 108 సార్లు, ఓం శ్రీ లక్ష్మీయైనమః అనే మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధతో సంధ్యాసమయంలో జపిస్తే తప్పక అష్ట ఐశ్వర్యాలు వస్తాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news