ఇకపై మాస్క్​ లేకుంటే రూ. 2వేలు చెల్లించాల్సిందే..!

-

దిల్లీ ప్రభుత్వం కరోనా నివారణకు చర్యలు ముమ్మరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. గురువారం ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనాపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో నాయకులంతా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నుంచి ప్రథమంగా కాపాడే మాస్క్ ను అందరు విస్మయిస్తున్నారి అందుకే ఫైన్ పెంచినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

arvind kejriwal
arvind kejriwal

గురువారం నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో 80 శాతం పడకలను కొవిడ్​ రోగులకు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అనంతరం.. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని పార్టీలు ఒక్కటై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.దిల్లీలో ఎక్కువ మంది మాస్కులు ధరిస్తున్నా.. ఎక్కడో చోట కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ఇకపై ఎవరైనా మాస్కు ధరించకుంటే రూ. 2000 జరిమానా చెల్లించాల్సిందే. మాస్కు ధరిస్తే.. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని స్పష్టం చేశారు. మాస్కులు పంపిణీ చేయాలని.. సామాజిక, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

కరోనా రోగుల చికిత్స కోసం 1400 ఐసీయూ పడకలను ఏర్పాటు చేసినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఛట్‌పూజను చెరువులు, నదులు, సరస్సుల వద్ద జరుపుకోరాదని ప్రజలను కోరారు.ఛట్ పూజ వల్ల కరోనా మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కరోనా పరీక్షలు పెంచేందుకు దిల్లీ ప్రభుత్వం.. అవసరమైన అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లా న్యాయాధికారులు, జిల్లా ముఖ్య వైద్యాధికారులు వెంటనే.. తమ పరిధిలో ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేయాలని ఆదేశించింది. కొత్త పరీక్షా కేంద్రం ఎక్కడ నెలకొల్పాలో ఇవాళ సాయంత్రానికి గుర్తించాలని.. పరీక్షా కేంద్రాల సంఖ్యను నవంబర్ 21 నాటికి పెంచాలని స్పష్టం చేసింది.దిల్లీలో కొద్ది రోజులుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 131 మంది చనిపోయారు

Read more RELATED
Recommended to you

Latest news