యూట్యూబ‌ర్‌పై అక్ష‌య్ 500 కోట్ల దావా!

-

బాలీవుడ్‌లో అత్యంత బిజీ స్టార్ అక్ష‌య్‌కుమార్‌. అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న స్టార్‌గా కూడా రికార్డు సాధించిన అక్ష‌య్‌కుమార్ తాజాగా యూట్యూబర్ రషీద్ సిద్దిఖీపై 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అనుమానాస్పంగా మృతి చెందిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ `ఎంఎస్ ధోని` వంటి భారీ బ‌డ్జెట్ బ‌యోపిక్ లో న‌టించే ఛాన్స్‌ని పొంద‌డం అక్షయ్ కుమార్ కు న‌చ్చ‌లేద‌ట‌. ఈ విష‌యంలో ఫీలైన అక్ష‌య్ ఇటీవ‌ల సుశాంత్ మృతి కేసుని ప్ర‌భావితం చేశాడ‌ని, ఈ కేసు నీరుగార్చ‌డానికి పోలీసుల‌తో పాటు ఆదిత్య ఠాక్రేని కూడా క‌లిశారంటూ యూట్యూబ‌ర్ అక్ష‌య్‌కుమార్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఈ వ్యాఖ్యల్ని సీరియ‌స్‌గా తీసుకున్న అక్ష‌య్‌కుమార్ యూట్యూబ‌ర్ రషీద్ సిద్దిఖీపై 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. గ‌త కొన్ని నెల‌లుగా పాపులారిటీ కోసం యూట్యూబ‌ర్ ప‌లువురు సెల‌బ్రిటీల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే ఆయ‌న కుమారుడు ఆదిత్య ఠాక్రేల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డంతో అత‌న్ని అరెస్ట్ చేశారు. ఇటీవ‌ల బ‌య‌టికి వ‌చ్చిన యూట్యూబ‌ర్ ర‌షీద్ సిద్ధిఖీ మ‌ళ్లీ అదే త‌ర‌హాలో ప్ర‌ముఖుల‌ను టార్గెట్ చేయడం మొద‌లుపెట్టాడు.

ఇలా సెల‌బ్రిటీల‌పై ఆరోప‌ణ‌లు చేస్తూ వీడియోలు విడుద‌ల చేయ‌డం ద్వారా ర‌షీద్ 15 లోల వ‌ర‌కు యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందాడ‌ట‌. అత‌ని చాన‌ల్ వీవ‌ర్స్ 2 ల‌క్ష‌ల నుంచి 3 ల‌క్ష‌ల వ‌ర‌కు పెరిగార‌ట. తాజాగా అక్ష‌య్‌పై చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తి ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి, త‌ను కెన‌డా పారిపోవ‌డానికి అక్ష‌య్ సాహాయం చేశాడంటూ ఆరోప‌ణ‌లు చేశాడు. దీంతో ఆగ్ర‌హించిన అక్ష‌య్ రషీద్ సిద్దిఖీపై 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news